సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారంద‌రికీ మంచి ప‌ద‌వులే ఇచ్చి గౌర‌వించారు జ‌గ‌న్. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యాన పార్టీ త‌ర‌ఫున పోటీచేసి ఓడిపోయినా స్థానిక ఎన్నిక‌ల్లో అదే వ్య‌క్తులు త‌మ స‌త్తా చాట‌డంతో ఉన్న‌త ప‌ దవులు ఇచ్చి వారిని కాపాడుకున్నారు జ‌గ‌న్. టెక్క‌లి లో దువ్వాడ శ్రీ‌ను కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌గా, అదే టెక్క‌లిలో మ‌రో నాయ‌కుడు పేరాడ తిల‌క్ కు కాళింగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఇవ్వడ‌మే కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూ ఆయనే అభ్య‌ర్థి అని తేల్చేశారు. దువ్వాడ శ్రీ‌ను శ్రీ‌కా కుళం ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా కూడా..కింజ‌రాపు కుటుంబాన్ని అత్యంత స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నార‌ని ఎమ్మెల్సీ ప‌దవి ఇచ్చి మంచి స్థాయికి చేర్చారు. వీ రిద్ద‌రే కాకుండా పిరియా సాయి రాజు కు కూడా మంచి స్థానాన్నే ఇచ్చారు. అవును! ఆయ‌న ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోతే నిరాశ చెందవ‌ద్ద‌ని తగిన స‌మ‌యంలో మంచి ప‌ద‌వే ఇస్తా న‌ని చెప్పి పంపారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న‌న్న ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారని త‌న భార్య విజ‌య కు జెడ్పీ చై ర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించార‌ని పొంగిపోతున్నారు సాయిరాజు. త‌న లాంటి విధేయుల‌కు ద‌ క్కిన గౌర‌వం ఇది అని చెబుతున్నా రాయ‌న‌. ఈ నేప‌థ్యంలో కొన్ని ఆస‌క్తిదాయ‌క విష‌యాలు.


గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సాయిరాజు పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో ఓ కాంట్రాక్టరుగా ఉన్న ఆయ‌న టీడీపీ నేత‌ ఎర్ర‌న్న ఆశీస్సుల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. విపరీతం అయిన ఆవేశ‌ప‌రుడిగా పేరున్న సాయి రాజు ఆ రోజుల్లో ఎర్ర‌న్న దీవెన‌ల తో ఓ సారి ఎమ్మెల్యేగా టీడీపీ త‌ర‌ఫున పోటీచేసి గెలిచారు. ఆ త‌రువాత ఎర్ర‌న్న చ‌నిపోయిన త‌రువాత పార్టీని వీడి వైసీపీ గూటికి చేరుకున్నారు. వైసీపీలోఉంటూ ఉంటూ స‌మైక్య ఉద్య‌మాల్లో మంచి స్థాయిలో చొచ్చుకుని పోయారు.

ఓ సంద‌ర్భంలో విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ  ఆత్మ హ‌త్య చేసుకుంటాన‌ని ఒంటిపై పెట్రోలు ఒంపుకుని నిప్పు అంటించుకునేందుకు సిద్ధం అయ్యారు. అనుచరులు, పోలీసులు వ‌ద్ద‌ని వారించ‌డంతో వెన‌క్కు త‌గ్గారు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో అశోక్ (బెందాళం అశోక్) చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం ప‌నిచేసి, మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ స‌మ‌యంలో మంచి సేవ‌లు అందించారు. సొంత డ‌బ్బుల‌తో రెండు అంబు లెన్సులు కొనుగోలు చేసి అప్ప‌టి క‌లెక్ట‌ర్ నివాస్ కు అప్ప‌గించారు. అంతే కాదు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ్వ‌రికీ ఏ క‌ష్టం వ‌చ్చినా బాగానే స్పందించారు. లాక్డౌన్ టైంలో మంచి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి మ‌న్ననలు అందుకు న్నారు. ఇవే జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యేలా చేశాయి.దీంతో ఆయ‌న భార్య‌కు జెడ్పీ చైర్మ‌న్ ప‌దవి వ‌రించింది. దీంతో సాయిరాజు వ‌ర్గంలో ఆనందోత్సాహాలు వ్య‌క్తం అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: