గత ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి సాయిరాజు పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఓ కాంట్రాక్టరుగా ఉన్న ఆయన టీడీపీ నేత ఎర్రన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. విపరీతం అయిన ఆవేశపరుడిగా పేరున్న సాయి రాజు ఆ రోజుల్లో ఎర్రన్న దీవెనల తో ఓ సారి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. ఆ తరువాత ఎర్రన్న చనిపోయిన తరువాత పార్టీని వీడి వైసీపీ గూటికి చేరుకున్నారు. వైసీపీలోఉంటూ ఉంటూ సమైక్య ఉద్యమాల్లో మంచి స్థాయిలో చొచ్చుకుని పోయారు.
ఓ సందర్భంలో విభజనను వ్యతిరేకిస్తూ ఆత్మ హత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోలు ఒంపుకుని నిప్పు అంటించుకునేందుకు సిద్ధం అయ్యారు. అనుచరులు, పోలీసులు వద్దని వారించడంతో వెనక్కు తగ్గారు. ఇక మొన్న ఎన్నికల్లో అశోక్ (బెందాళం అశోక్) చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం పనిచేసి, మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించారు. సొంత డబ్బులతో రెండు అంబు లెన్సులు కొనుగోలు చేసి అప్పటి కలెక్టర్ నివాస్ కు అప్పగించారు. అంతే కాదు నియోజకవర్గంలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా బాగానే స్పందించారు. లాక్డౌన్ టైంలో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టి మన్ననలు అందుకు న్నారు. ఇవే జగన్ కు దగ్గరయ్యేలా చేశాయి.దీంతో ఆయన భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి వరించింది. దీంతో సాయిరాజు వర్గంలో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి.