ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అంతటితో ఆగకుండా... మరో పది మందిని వివిధ కారణాలతో సలహాదారులుగా నియమించారు. వీరికి ప్రతి నెలా లక్షల్లో వేతనం చెల్లిస్తోంది కూడా ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి పలు కీలక అంశాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అటు న్యాయపరంగా, ఇటు రాజకీయ పరంగా, రాజ్యాంగ పరమైన అంశాల్లో కూడా ప్రభుత్వానికి సలహాదారులు సరైన సలహాలు ఇవ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు వైఎస్ జగన్. దీంతో అటు ప్రభుత్వంతో, ఇటు పార్టీ పనుల్లో కూడా సజ్జల ఫుల్ బిజీ అయిపోయారు. ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ విమర్శలు, పార్టీ నేతలు ఇలా ఎన్నో అంశాలు సజ్జల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారనే అపవాదు కూడా ఉంది. అందువల్లే ఇంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ... వైసీపీ సర్కార్కు ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అంతటితో ఆగకుండా... మరో పది మందిని వివిధ కారణాలతో సలహాదారులుగా నియమించారు. వీరికి ప్రతి నెలా లక్షల్లో వేతనం చెల్లిస్తోంది కూడా ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి పలు కీలక అంశాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అటు న్యాయపరంగా, ఇటు రాజకీయ పరంగా, రాజ్యాంగ పరమైన అంశాల్లో కూడా ప్రభుత్వానికి సలహాదారులు సరైన సలహాలు ఇవ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు వైఎస్ జగన్. దీంతో అటు ప్రభుత్వంతో, ఇటు పార్టీ పనుల్లో కూడా సజ్జల ఫుల్ బిజీ అయిపోయారు. ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ విమర్శలు, పార్టీ నేతలు ఇలా ఎన్నో అంశాలు సజ్జల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారనే అపవాదు కూడా ఉంది. అందువల్లే ఇంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ... వైసీపీ సర్కార్కు ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు.