ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదని గతంలోనే ప్రియాంక ప్రకటించారు. తాము ఒంటరిగానే 400 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రియాంక. అలాగే దాదాపు 40 శాతం పైగా సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు కూడా ప్రియాంక గతంలో ప్రకటించారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన యువతులకు ఓ స్కూటీ అందిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా మహిళల కోసమే ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు ప్రియాంక. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఏకంగా 40 శాతం కోటా కల్పిస్తామని ప్రకటించారు ప్రియాంక. మహిళలకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 25 హాస్టళ్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని కూడా తెలిపారు. ఇక 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రియాంక.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదని గతంలోనే ప్రియాంక ప్రకటించారు. తాము ఒంటరిగానే 400 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రియాంక. అలాగే దాదాపు 40 శాతం పైగా సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు కూడా ప్రియాంక గతంలో ప్రకటించారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన యువతులకు ఓ స్కూటీ అందిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా మహిళల కోసమే ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు ప్రియాంక. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఏకంగా 40 శాతం కోటా కల్పిస్తామని ప్రకటించారు ప్రియాంక. మహిళలకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 25 హాస్టళ్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని కూడా తెలిపారు. ఇక 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రియాంక.