
యూపీలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటేకి ఏబీపీ - సీ ఓటర్ సంస్థ సర్వే రిపోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ కూడా ఇదే మాటను మరోసారి వెల్లడిస్తోంది. తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో అధికార కమలం పార్టీకి జరగనున్న ఎన్నికల్లో 240 నుంచి 250 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండియా టీవీకి చెందిన గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఒపీనియన్ పోల్ రిపోర్ట్ వెల్లడించింది. అధికారం ఖాయమని ధీమాతో ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి కేవలం 160 నుంచి 165 సీట్లు గెలుస్తుందని తేల్చేసింది. రెండేళ్లుగా యూపీపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ... కేవలం 5 నుంటి 7 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అయితే కేవలం 2 సీట్లు మాత్రమే గెలవనున్నట్లు నివేదికలో తేలింది.