కర్ణాటక రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా ఎక్కువ అవుతుంది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసు వివరాలను బులిటెన్ ద్వారా మీడియాకు తెలియపరిచింది.
ఇక ఇందులో తెలిపిన విధంగా 24 గంటల్లో ఏకంగా 947 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నేటి వరకు మొత్తం కరోనా కేసులు 15242 గా నమోదయ్యాయి.
Covid19 Bulletin: 30th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 30, 2020
Total Confirmed Cases: 15242
Deceased: 246
Recovered: 7918
New Cases: 947
Other information: Telemedicine facility, Corona watch application and Helpline details.#KarnatakaFightsCorona#Covid19Karnataka@BSYBJP pic.twitter.com/Tui2weh6C6
మరోవైపు రాష్ట్రంలో నేడు ఒక్క రోజే 235 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 7918 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వైరస్ బారిన పడి 20 మంది మరణించారు. ఈ సంఖ్యతో నేటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 246 మంది మృతి చెందారు.
మరోవైపు రాష్ట్రంలో 7074 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో 271 మందికి వారి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు వైద్యులు.