ఈ క్రమంలోనే చైనాతో తలెత్తిన విడుదల నేపథ్యంలో ఇప్పటికే అధునాతన టెక్నాలజీతో కూడిన పలు విదేశీ ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేర్చిన భారత ప్రభుత్వం.. ఇక భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో తయారుచేసి వినూత్నమైన ఆయుధాలు కూడా శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ భారత ఆర్మీలో చేరుస్తున్న విషయం తెలిసిందే . రోజురోజుకు డిఆర్డివో తెరమీదకు తెస్తున్న ఆయుధాల సామర్ధ్యాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే మరో ఆయుధాన్ని కూడా సిద్ధం చేసింది భారత్.
ఇప్పటికే వరుసగా ప్రయోగాలు జరుగుతూ విజయవంతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే భారత్ స్వతంత్రంగా తయారు చేసినటువంటి అస్త్ర మార్క్ బివిఆర్ఏఎమ్ మిస్సైల్ 150 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి లక్ష్యాలను ఎంతో సమర్థవంతంగా ఛేదించగలిగింది. యుద్ధ విమానాలను బిగించేందుకు వీటిని కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అటు రక్షణ శాఖ నుంచి హోంశాఖ నుంచి కూడా అనుమతులు రావడంతో ఇక ఈ మిస్సైల్ భారత అమ్ములపొదిలోకి చేరుకొంది. ప్రస్తుతం రోజు రోజుకు మరింత శరవేగంగా మారిపోతున్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది