కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పలు సర్వీసులు రద్దు అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. అయినా కూడా కొన్ని సర్వీసులు ఇప్పటికీ ఆగిపోయాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థ.. రెండు రాష్ట్రాల మధ్య ప్రవేట్ వాహనాలు , బస్సులు యధావిధిగా కొనగిస్తున్నారు. కానీ ప్రభుత్వ బస్సులు, కొన్ని సర్వీసులు ఇప్పటికీ కొనసాగడం లేదు అన్న సంగతి తెలిసిందే.. అయితే రెండు రాష్ట్రాల నుంచి బస్సు సర్వీసులు తిరగడానికి ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసి ఆధికారులు భేటీ అయ్యి చర్చలు జరిపారు.. 



కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఇప్పుడు సర్వీసులు తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు .ఇన్ని లక్షల కిలోమీటర్లు వరకు తిరగొచ్చు అని ప్రభుత్వాలు నిర్ణయించిన కూడా తెలంగాణ సర్కార్ మాత్రం సర్వీసులను తిప్పడానికి వెనకడుగు వేస్తుంది.ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు తెలంగాణలో 2.60 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతాయి. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు ఏపీలో 1.66 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.ఏపీ బస్సులు తెలంగాణలో లక్ష కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయని, దీన్ని తగ్గించుకుని అంతర్రాష్ట్ర పర్మిట్లు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.



ఈ విషయం పై స్పందించిన ఉన్నతాధికారులు ఏపి బస్సులను 50 వేల కిలో మీటర్లు తగ్గించుకుంటామని , తెలంగాణ సర్వీసులు మరో 50 వేల కిలోమీటర్లు పెంచుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.కాగా, ఏపి లో తిప్పడానికి వారి దగ్గర బస్సులు లేవని కొంటె సాకు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ అధికారులు లక్ష కిలో మీటర్లు తగ్గించుకుంటామని సూచించారు. ఈ దశలోనే తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ టూ విజయవాడలో మాత్రమే బస్సులను తిప్పాలని మిగితా ప్రాంతాల్లో అవసరం లేదని చెప్పారు. ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసి కి మింగుడు పడలేదు..మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుంది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: