తెలంగాణలో ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని అన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. చలాన్లు కొట్టొద్దు.. బండిపై నలుగురు ఎక్కొచ్చని అంటున్నాడు. తాగి బండి నడపవచ్చట. బండి పోతే బండి ఫ్రీ. కారుపోతే కారు ఫ్రీ. ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ. 25 వేలు ఇస్తానని ఆయన అంటున్నాడు. వరదసాయం రూ.10 వేలు ఇస్తుంటే మీరే ఆపారు. అలాంటిది రూ.25 వేలు ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా? వరదల సమయంలో మేమంతా మీవెంటే ఉన్నాం.’’ అని ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ నేతల కథలు వినేందుకు.. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. హైదరాబాద్. మీ డ్రామాలు ఇక్కడ నడవవు. మీరు ఆగమాగం చేస్తే ఎవరూ కారు. ఆరేళ్లలో హైదరాబాద్లో మేం ఎన్నో చేశాం. ఆరేళ్లలో హైదరాబాద్కు కేంద్రం ఏం చేసింది? కిషన్ రెడ్డికి దమ్ముంటే ఒక్కటంటే ఒక్క పని చూపించండి.’’ అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని అన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. చలాన్లు కొట్టొద్దు.. బండిపై నలుగురు ఎక్కొచ్చని అంటున్నాడు. తాగి బండి నడపవచ్చట. బండి పోతే బండి ఫ్రీ. కారుపోతే కారు ఫ్రీ. ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ. 25 వేలు ఇస్తానని ఆయన అంటున్నాడు. వరదసాయం రూ.10 వేలు ఇస్తుంటే మీరే ఆపారు. అలాంటిది రూ.25 వేలు ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా? వరదల సమయంలో మేమంతా మీవెంటే ఉన్నాం.’’ అని ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ నేతల కథలు వినేందుకు.. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. హైదరాబాద్. మీ డ్రామాలు ఇక్కడ నడవవు. మీరు ఆగమాగం చేస్తే ఎవరూ కారు. ఆరేళ్లలో హైదరాబాద్లో మేం ఎన్నో చేశాం. ఆరేళ్లలో హైదరాబాద్కు కేంద్రం ఏం చేసింది? కిషన్ రెడ్డికి దమ్ముంటే ఒక్కటంటే ఒక్క పని చూపించండి.’’ అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.