అలా సాగు సమయంలోనే విషపూరిత రసాయనాలు పంటల్లోకి చేరిపోతున్నాయి.. ఇక పట్టణాలు, నగరాల్లో తాజా కూరగాయలు లభించడమే చాలా కష్టం.. పట్టణాల్లో లభించే పండ్లు, కూరగాయలపై రసాయన అవశేషాలుంటున్నట్లు శాస్త్రీయంగా నిర్వహించే పరీక్షల్లో గుర్తించారు. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పండ్లు, కూరగాయలు కొన్నప్పుడు నేరుగా కోసుకుని తినొద్దని నిపుణులు చెబుతున్నారు.
మరి ఏం చేయాలి.. కూరగాయలు కొని నేరుగా వాటిని కోసి ఎట్టి పరిస్థితుల్లో వండుకోవద్దంటున్నారు. మరి ఎలా వినియోగించాలి అంటారా.. పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా నల్లా నుంచి ధారగా వచ్చే నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా లేదా ఉప్పు వేసి అందులో కూరగాయలు కొద్దిసేపు ఉంచి మళ్లీ కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిపై రసాయన అవశేషాలుంటే చాలా వరకూ తొలగిపోతాయి.
కూరగాయల లోపల ఉండే రసాయనాలను ఎలాగూ మనం నిరోధించడం.. కనీసం పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా నల్లా నుంచి ధారగా వచ్చే నీటిలో శుభ్రంగా కడగడం ద్వారా కొంత వరకూ రసాయనాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా లేదా ఉప్పు వేసి అందులో కూరగాయలు కొద్దిసేపు ఉంచి మళ్లీ కడగడం ద్వారా ఉపరితలంపై ఉన్న రసాయనాల అవశేషాలను తొలగించుకోవచ్చు. అందుకే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ఏమంటారు..!