టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో గుంటూరు వైసీపీ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల దేవాదానం,అతని అనుచరులు జాయిన్ అయ్యారు. అలాగే నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో సత్తెనపల్లి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఆత్కూరి నాగేశ్వరావు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు గారి హయాంలో దళితుల పై దాడి చేయాలి అంటే ఎవరైనా భయపడేవారు అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల పై దమనకాండ కొనసాగుతుంది అని ఆయన ఆరోపించారు.

టిడిపి హయాంలో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఎస్సి కాలనీల నుండే ప్రారంభించే వాళ్ళం అని అన్నారు. కుడి చేత్తో వంద రూపాయిలు ఇచ్చి,ఎడమ చేత్తో వెయ్యి కొట్టేస్తున్నారు అని మండిపడ్డారు. 10 నెలల్లో 73 వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచేసారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు,మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని అన్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు....రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని విమర్శలు చేసారు. ఏపీ మరో బీహార్ లా తయారుచేసారు అని లోకేష్ అన్నారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసారు... ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తారు అని ఆయన ఆరోపించారు. ఇంటి పన్నులు పెరగాలి అంటే జగన్ రెడ్డి కి ఓటు వెయ్యుచ్చు అని సూచించారు. 10 వాగ్దానాలతో మీ ముందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థులను గెలిపించండి అని సూచించారు. నాడు నేడు ఎప్పుడు టీడీపీ దళితుల పక్షమే అని అన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా,కేసులు అంటూ భయపెడుతున్నా పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నా.మీ అందరికి పార్టీ అండగా ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చారు. వైకాపా లో దళితులకు అన్యాయం జరుగుతుంది  అని అన్నారు. దళితులకు చెందాల్సిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: