దీని కారణంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎక్కువగా నష్టపోతున్నది. అయితే ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతమంది నేతలు విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తనకు సహకరించని సీనియర్ నేతలను తమ పార్టీ నుంచి పక్కకు తప్పించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అగ్రనేతల హవా అనేది ఎక్కువగా ఉంది. దీని వలన సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
చాలా వరకు జిల్లాలో అగ్ర నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో చాలా మంది యువ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ కొంతమందిని పక్కన పెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉన్న సమస్యలను పట్టించుకునే విషయంలో ఇప్పటివరకు నారా లోకేష్ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీలో సమస్యలు పరిష్కరించలేదు అంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్టీలో ఎంతవరకు నేతలు పని చేస్తున్నారు ఏంటనేది దానిపై ఆయన ఒక నివేదిక కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.