ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేసిన ఏపీ సర్కార్.. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కాగా.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయినా జగన్ సర్కార్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమే కాదు షెడ్యూల్ కూడా ఇచ్చింది. జగన్ రెడ్డి సర్కార్ పై తీరుపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డాయి.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేసిన ఏపీ సర్కార్.. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కాగా.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయినా జగన్ సర్కార్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమే కాదు షెడ్యూల్ కూడా ఇచ్చింది. జగన్ రెడ్డి సర్కార్ పై తీరుపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డాయి.