జగన్ సంక్షేమం సూపర్..కానీ అభివృద్దే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురి పెట్టాడు. ఇరవై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. తాజాగా మళ్లీ వెంటనే మేకపాటి గౌతంరెడ్డిని పంపి ఫాలో చేయించారు.

ఈ ప్రాజెక్టు ఏపీ తలరాత మార్చే సత్తా ఉందని చెబుతున్నారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ స్థాపనకు కేంద్రం కూడా ముందడుగు వేస్తోంది. పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే యాభై లక్షల మందికి ఉపాధి అవకాశా లు లభించే అవకాశం ఉంది. ఈ అతిపెద్ద ప్రాజెక్టు ద్వారా రెండు మూడేళ్లలో ఏపీకి పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం రాబోతోంది. ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో ఇరవై ఐదు నుండి ముప్పై వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి. ఇలా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకి కావాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇటీవల పెట్రోల్లో ఇథనాల్ వినియోగం పది నుంచి ఇరవై శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

అందువల్ల రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ఏపీ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీల హబ్ గా కూడా మారుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు చాలా శ్రద్ధగానే ఉన్నాయి. సకాలంలో ఈ ప్రాజెక్టును ఫాలో అప్ చేసుకుని పూర్తి చేసుకోగలిగితే.. ఏపీ అభివృద్ధికి చాలా తోడ్పడుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: