అలాంటి వక్తికి అధికారం ఇచ్చిన వాళ్లదే తప్పు తప్ప, అధికారం చేజిక్కించుకుని రాష్ట్రాన్ని నంజుకు తిన్న వాళ్ళది మాత్రం తప్పేమి ఉండదు. నిజం, ఒక్కసారి అలాంటివారిని తరిమి తరిమి కొట్టకపోతే వాళ్ళు అధికార దాహంతో ఎన్నెన్ని చండాలాలు చేయడానికైనా సిద్దంపడతారు. ఒక నక్కనే చుడండి, అది కనిపిస్తే వెంటనే తరిమి కొడతామా లేదా, అదే మనస్తత్వం ఉన్న వారిని కూడా అంతకు మించి చేయడానికి ఏమి ఉంటుంది. ఇన్నేళ్లు పదవి ఇచ్చి మరి నక్కతో తన్నించుకున్న జనానికి తెలియాలి ఆయన ఉత్తమ ఘనత గురించి. బహుశా ఉత్తముడు అనే పదానికి వీళ్ళే కొత్త అర్దాలు రాసేసుకున్నారేమో, దానినే అందరు అనుసరిస్తున్నారేమో మరి. తాజాగా ఆయన ఒక మాట అంటారు, ఎప్పడూ చూడు రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో అంటారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో, అనుభవంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు అనేది తెలియకుండానే పాలించాడా. అదే అయిఉంటుంది, అధికార దాహం తప్ప మరొకటి తెలియని వాడికి చట్టం, న్యాయ వ్యవస్థల గురించి ఏమి తెలుస్తుంది. అసలు అవసరం కూడా లేదు.
ప్రతి వ్యక్తికి అయితే దేశభక్తి, లేకపోతే ప్రపంచ శాంతి పట్ల, లేదంటే పూర్తిగా సొంత విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇవన్నీ సమాజానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయబోవు. కానీ అధికారదాహం ఉన్నవాడు ఒక్కడు ఉంటె ఇప్పటి చైనా అనుభవించడం లేదు, బానిస బ్రతుకులు అంతే ఉంటుంది పరిస్థితి. అనుభవం ఎన్నాళ్లు అని కాదు సేవ ఎంత చేయగలిగాము అనేది ముఖ్యం. అదే లేనప్పుడు అనుభవం ఎంత ఉంది ప్రయోజనం ఏమిటి!