టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోలలో టాప్ రేంజ్ లో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుస విజయాలతో బాలయ్య తన స్థాయిని రోజు రోజుకి పెంచుకుంటూనే ఉన్నారు. అలాగే తన సినిమాలతో అరుదైన ఘనతను కూడా అందుకుంటూ తన ఇమేజ్ ని పెంచుకున్న ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య నటించిన చివరి సినిమా భగవంతు కేసరి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు.


బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయంలో నటించారు.. పోలీస్ ఆఫీసర్ గా, తండ్రిగా కూడా నటించి మంచి మార్కులే అందుకున్నారు. శ్రీ లీల ,కాజల అగర్వాల్ కూడా ఇందులో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రూ .132 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. అలాగే రూ .70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లే సమాచారం. తాజాగా బాలకృష్ణ ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే రామకృష్ణ థియేటర్లో రోజుకి నాలుగు ఆటలతో భగవంతు కేసరి సినిమా ఒక సంచలనాలను సృష్టిస్తోంది.


గతంలో పోకిరి సినిమా ఈ థియేటర్లో 200 రోజులు అడగా పలు రికార్డులను సృష్టించింది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా విడుదల దాదాపుగా ఆరు నెలలు అవుతున్న ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. సీనియర్ హీరోలలో ప్రస్తుతం బాలయ్య రికార్డును ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేనని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. బాలయ్య ప్రతి సినిమాతో కూడా తన టాలెంట్ నిరూపించుకొని ఎదుగుతూ ఉన్నారు. అఖండ సినిమాకు ముందు అన్ని ప్లాపులు మూట కట్టుకున్న బాలయ్య ఒక్కసారి మళ్ళీ మార్కెట్ ను పెంచుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబి, బాలయ్య కాంబినేషన్లో 109 వ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కూడా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: