
హైదరాబాద్లో సుమారు 20 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నివసిస్తున్నారని, వారికి తాగునీటి సరఫరా కోసం ఉమ్మడి జల వనరుల నుంచి సమర్థవంతమైన చర్చలు జరపాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని రేవంత్ అన్నారు. కానీ, కేసీఆర్ ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలిచారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర జలాల విషయంలో సీమాంధ్ర నాయకులు తప్పులు చేసినా, కేసీఆర్ చేసిన నష్టం దానికంటే గణనీయంగా ఎక్కువని రేవంత్ స్పష్టం చేశారు.
ఈ విషయాలను ప్రజల ముందు బహిర్గతం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.కేసీఆర్ను ఈ అంశాలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ సమావేశాలు సరైన వేదిక అని రేవంత్ పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా చర్చల నుంచి తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాస్తవాలను చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, కేసీఆర్ చర్చకు నిరాకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలిసేలా సహకరించాలని ఆయన కోరారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు