బ‌ద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మూడు రౌండ్ల లో ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. తొలి రౌండ్ లో 8700 ఓట్ల మెజార్టీ సాధించిన వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వెంక‌ట సుధ దూసుకు పోతున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల నుంచే వైసీపీ దూసుకు పోతోంది. ఇక రెండు, మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు కూడా పూర్త‌య్యింది. అయితే మ‌న‌కు మాత్రం అధికారికంగా తొలి రౌండ్ ఫ‌లితం మాత్ర‌మే వెలు వ‌డింది.

ఇక మూడు రౌండ్లు ముగిసే స‌రికి వైసీపీ క్యాండెట్ ఏకంగా 23, 700 ఓట్ల బంప‌ర్ మెజార్టీతో దూసుకు పోతున్నారు. తొలి రౌండ్ లో క‌ల‌శ‌పాడు మండ‌ల ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఏడు మండ‌లాలు ఉన్నాయి. బ‌ద్వేల్ మున్సిపాల్టీ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ దూకుడు చూస్తుంటే వైసీపీ మొత్తం 12 రౌండ్లు పూర్త‌య్యే స‌రికి తాము అనుకున్న‌ట్టుగా ల‌క్ష ఓట్ల మెజార్టీ ని సాధించే దిశ‌గా వెళుతోంది. ఇక తొలి రౌండ్‌లో నోటాకు 342 ఓట్లు రావ‌డం విశేష‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: