మహారాష్ట్రలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. 24 గంటల్లోనే ఏకంగా 123 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్19 మరణాల సంఖ్య 2710కి చేరుకుంది. అదే విధంగా ఒక్కరోజులోనే 2933 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 77,793కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర రాజధాని ముంబైలో 44,931 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. నగరంలోని అతిపెద్ద స్లమ్ ధారావిలో కొత్తగా 23 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అక్కడ మొత్తంగా 1872 మందికి కరోనా సోకింది.