జగన్ జే- టర్న్ లతో రాష్ట్రం రివర్స్ లో వెళుతోంది అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పరిపాలనను ఎండగట్టేప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జగన్ జే-టర్న్ అంటూ ఓ వీడియోని సోషల్ మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. జగన్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు 45 సంవత్సరాలు నిండినవారకి పింఛన్లు ఇస్తామన్నాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే వెంటనే కేంద్రం మెడలు వంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను తెస్తామన్న జే-గాన్ తాను గెలిచిన తరువాత కేంద్రం నుండి ఏపీ కి ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ బ్రతిమిలాడుతూనే ఉన్నదంటూ దుయ్యబట్టారు.
అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు స్పందించిన జగన్ అధికారం లోకి రాగానే రాజధానిని మూడుముక్కలు చేశాడు అంటూ ఎద్దేవా చేశాడు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం ఇస్తానన్న జగన్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు అడిగితే నీయమ్మ మొగుడికి చెప్పామా సన్న బియ్య ఇష్టం అన్నారంటూ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు ..ఈ సందర్భాన్ని వివరిస్తూ జగన్ బాబు కాస్త జే-గాన్ బాబు అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు..ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతా లో ఓ వీడియో ని పంచుకున్నాడు బాబోరు ..మరి ఈ ఈ వీడియో పై వైసిపి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ...
వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ..#1YearOfMassDestruction pic.twitter.com/YCybyP58oO
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 29, 2020