ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కేసులు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

వారి కారణంగానే ఇప్పుడు కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 1100 మందికి దాదాపుగా కరోనా సోకింది. ఇక ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. వారిలో ఇప్పటి వరకు 202 మందికి కరోనా సోకింది. దీనితో ఏపీ సర్కార్ కొన్ని రోజుల పాటు సరిహద్దులు మూసేసే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: