విశాఖ ఏజెన్సీ లో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం దిగుడు పుట్టు వంతెన సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. పోలీసులను చూసి వాహనానంలో ఉన్న ఇద్దరు పరారయ్యారు.

 

బొలెరో వాహనంలో కూరగాయల బుట్టల కింద గంజాయి పేర్చారాని... 380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అప్పలనాయుడు తెలిపారు.ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇలాంటి గంజాయి తరలింపులు ఎప్పటికప్పుడు జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై ఉన్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: