తెలంగాణా తొలి హోం మంత్రి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు సీఎం కెసిఆర్. తెలంగాణ ఉద్యమంలో, టీ.ఆర్.ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఆయన. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన  ఆయన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటా అని హామీ ఇచ్చారు.  ఇక తెరాస మంత్రులు నేతలు కూడా ఆయనకు నివాళి అర్పించారు.

కవిత కూడా సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. “కార్మిక పక్షపాతి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం బాధాకరం. తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి ‌నర్సన్న. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: