మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బిజెపి బైక్ ర్యాలీ రోడ్ షో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్... రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఈ  కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... హరీష్ రావ్ ఉదయం లేచిన నుంచే   కలెక్షన్లు చేసి సాయంత్రం  మాజీ ఎంపీ కవితకు ఎంపీ సంతోష్ కుమార్ కు  పంపకాలు  చేయడమే పని అంటూ మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబాన్ని దుబ్బాక ప్రజలు నల్లికుట్ల కుటుంబంగా భావిస్తున్నారు అని అన్నారు.  రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించి టిఆర్ఎస్ పార్టీని వైకుంఠ దామానికి పంపించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: