బిహార్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్న భారతీయ జనతా పార్టీ.. పలు హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పట్నాలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికను
కేంద్ర ఆర్థిక
మంత్రి,
బీజేపీ నేత నిర్మలాసీతారామన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు.. బిహార్ ప్రజలందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో ఇదే తొలి హామీగా పొందుపరిచామన్నారు నిర్మలా.
ఎన్డీఏకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నిర్మలా. వచ్చే ఐదేళ్లకు మళ్లీ ముఖ్యమంత్రిగా నితీశ్
కుమార్ ఉంటారని తెలిపారు. ఆయన పాలనలో బిహార్ దేశంలోనే మంచి పురోగతి, అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. ఒక
పార్టీ ఇచ్చే హామీలను తెలుసుకుని, అర్థం చేసుకుంటారు. ఎవరైనా మా మేనిఫెస్టోపై ప్రశ్నలు లేవనెత్తితే.. గతంలోని వాగ్ధానాలను నెరవేర్చిన పూర్తి విశ్వాసంతో సమాధానం ఇస్తాం అని అన్నారు.