విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పోలీసులు,మావోయిస్టుల మ‌ధ్య  ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు మృతి చెందిన‌ట్లు స‌మాచారం.తెలంగాణ‌కు చెందిన మావోయిస్టు కీల‌క నేత సందె గంగ‌య్య  మృతి చెందారు.మావోయిస్టు పార్టీలో డిప్యూటీ క‌మాండ‌ర్‌ ఫ‌ర్ మెయింటెన్స్ ప‌ద‌విలో ప్ర‌స్తుతం ఆయ‌న కోన‌సాగుతున్నారు.గంగ‌య్య స్వ‌స్థ‌లం పెద్ద‌ప‌ల్లి జిల్లా ఓదెల మండ‌లం గుంపుల గ్రామం. అయితే గ్రేహౌండ్స్ ద‌ళాలు మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి.ఎన్ కౌంట‌ర్ స‌మ‌యంలో కీల‌క మావోయిస్టు నేత‌లు త‌ప్పించుకున్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.సంఘటనా స్థలంలో ఎకే 47 ఎస్ఎల్ఆర్, తపంచ ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ద‌ట్ట‌మైన అట‌వీప్రాంతం కావ‌డంతో మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి కొంత స‌మ‌యం పట్టే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: