భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ ప్రీత్ కౌర్ తండ్రి  కుల్‌దీప్ సింగ్ తన పొలంలో  పనుల్లో హడావుడిగా ఉన్న నేపధ్యంలో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో తన కుమార్తె చేసిన అద్భుతమైన ప్రదర్శనను చూడలేకపోయారు అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కమల్‌ప్రీత్ కౌర్ తన మూడవ మరియు చివరి ప్రయత్నంలో 64 మీటర్లు విసిరి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దీనితో భారత్ కు మరో పతకం ఖాయమైంది.

పంజాబ్‌లోని శ్రీ ముక్తసర్ సాహిబ్‌లోని బాదల్ గ్రామానికి చెందిన కమల్‌ప్రీత్ తండ్రి... కూతరు ఒలంపిక్స్ కి వెళ్ళినా సరే తన పొలంలో వ్యవసాయ పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి... తాను ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తాను అని ఇప్పుడు పొలంలో ఉన్నానని చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: