సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న రైతులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లు వినాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ''భగత్సింగ్ వర్థంతి రోజు భారత్ బంద్నకు పిలుపునివ్వడం బాధాకరమని, ప్రభుత్వానికి నచ్చచెప్పేందుకు ఏడాదిగా రైతులు ప్రయత్నిస్తున్నా రైతుల గోడు వినేవారు లేరన్నారు. ఇది స్వంతంత్ర్ర భారతదేశమని, భారతావనిలోనే రైతుల గోడు ప్రభుత్వం వినకుంటే ఇంకెవ్వరు వింటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు డిమాండ్లు సరైనవేనని, వారి డిమాండ్లను కేంద్రం వినిపించుకోవాలని, మొదట్నించీ తాము రైతుల వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను కేంద్రం తెలుసుకోవాలని, తద్వారా రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లి తమ పనులు తాము చేసుకోగలుగుతారని, వ్యవసాయ మంత్రితో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఉపయోగం లేదని విమర్శించారు. రైతుల డిమాండ్లు వింటున్నామని, పరిష్కరిస్తామనే మాట కూడా మంత్రి నుంచి లేదని ఆక్షేపించారు. స్వతంత్ర భారతావనిలో అన్నదాతల పరిస్థితి ఇలా ఉందంటూ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న రైతులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లు వినాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ''భగత్సింగ్ వర్థంతి రోజు భారత్ బంద్నకు పిలుపునివ్వడం బాధాకరమని, ప్రభుత్వానికి నచ్చచెప్పేందుకు ఏడాదిగా రైతులు ప్రయత్నిస్తున్నా రైతుల గోడు వినేవారు లేరన్నారు. ఇది స్వంతంత్ర్ర భారతదేశమని, భారతావనిలోనే రైతుల గోడు ప్రభుత్వం వినకుంటే ఇంకెవ్వరు వింటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు డిమాండ్లు సరైనవేనని, వారి డిమాండ్లను కేంద్రం వినిపించుకోవాలని, మొదట్నించీ తాము రైతుల వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను కేంద్రం తెలుసుకోవాలని, తద్వారా రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లి తమ పనులు తాము చేసుకోగలుగుతారని, వ్యవసాయ మంత్రితో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఉపయోగం లేదని విమర్శించారు. రైతుల డిమాండ్లు వింటున్నామని, పరిష్కరిస్తామనే మాట కూడా మంత్రి నుంచి లేదని ఆక్షేపించారు. స్వతంత్ర భారతావనిలో అన్నదాతల పరిస్థితి ఇలా ఉందంటూ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.