సీనియర్ సిటిజన్లకు రిటైర్ అయ్యాక జీతం ఆదాయం ఉండదు కాబట్టి నెలవారీగా క్రమమైన ఆదాయం వచ్చేట్లు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. దీని కోసం పెట్టుబడులు పెట్టాలి. అయితే వయసు రీత్యా రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి రాబడితో పాటు పెట్టుబడుల సేఫ్టీ కూడా ముఖ్యమే.అందువల్ల నష్టభయం అనేది తక్కువగా ఉన్న పెట్టబడులు ఎంచుకోవాలి. అలాగే క్రమమైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు ఇంకా సులభంగా నిర్వహించగలిగేలా పెట్టుబడులు ఉండాలి.బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు సేఫ్ గా ఉండటంతో పాటు కచ్చితమైన రాబడిని కూడా అందిస్తాయి. రిటైర్ అయ్యాక డబ్బును దాచుకోవాలనుకుంటున్న వారికి ఇది మంచి ఆప్షన్.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా వేరు వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు కొంచెం ఎక్కువగా వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. ప్రభుత్వ ఇంకా అలాగే ప్రైవేట్ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ ఇంకా బ్యాంకింగేతర సంస్థలు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్ చేస్తాయి. అయితే కార్పొరేట్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రాబడిపై ఎలాంటి హామీ అనేది ఉండదు.అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో పెట్టుబడులు కేవలం 60 సంవత్సరాల తర్వాతనే ప్రారంభించాలి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద రిటైర్ మెంట్ తీసుకున్నవారు 55 సంవత్సరాల నుంచే ప్రారంభించొచ్చు. ఒకరు లేదా ఉమ్మడిగా ఈ ఖాతాలో మాక్సిమమ్ రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద దీనిపై పన్ను తగ్గింపులు లభిస్తాయి. ప్రస్తుత వడ్డీ రేటు వచ్చేసి 7.40 శాతంగా ఉంది.

అలాగే పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ లో అయితే ప్రస్తుత వడ్డీ రేటు 6.60 శాతం. దీనికి మెచ్యూరిటీ గడువు 5 సంవత్సరాలు ఉంటుంది . వ్యక్తిగత ఖాతాలో అయితే మాక్సిమం రూ. 4.50 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే రూ. 9 లక్షలు పెట్టుబడులు అనేవి పెట్టొచ్చు. అయితే రాబడిపై పన్ను రేట్లు అనేవి వర్తిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: