ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్న 16 వైద్య కళాశాలల్లో కూడా చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు సీహెచ్సీలు, పీహెచ్సీలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలపై కూడా అధికారులతో సీఎం జగన్ చర్చించారు. వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరిలోగా టెండర్ల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాశాలల నిర్మాణాలకు నవంబర్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు డిసెంబర్ నెలలో టెండర్లు పిలవాలన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, పెనుగొండ, అమలాపురం, ఆదోనిలలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు జనవరిలో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తానికి సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనలతో పనులు సత్వరమే మొదలవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్న 16 వైద్య కళాశాలల్లో కూడా చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు సీహెచ్సీలు, పీహెచ్సీలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలపై కూడా అధికారులతో సీఎం జగన్ చర్చించారు. వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరిలోగా టెండర్ల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాశాలల నిర్మాణాలకు నవంబర్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు డిసెంబర్ నెలలో టెండర్లు పిలవాలన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, పెనుగొండ, అమలాపురం, ఆదోనిలలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు జనవరిలో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తానికి సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనలతో పనులు సత్వరమే మొదలవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.