ఇక 'మా' ఎలక్షన్స్ లో హీరో మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న తెలుగు నటుడు ఇంకా అలాగే వైసీపీ కార్యకర్త అయిన పృథ్వి ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడితో జరిపిన ఫోన్ సంభాషణ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద కలకలకం సృష్టిస్తోందనే చెప్పాలి. ఇక దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయోచ్చు కానీ పాలించే అర్హత మాత్రం అసలు వుండదని చేసిన పృథ్వి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుండటం జరుగుతుంది. ఇక `మా` ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు కి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ని విజయవాడలో సన్మానించడం తనకు ఏమాత్రం నచ్చలేదని ఆయన తప్పుపట్టడం అనేది జరిగింది.ఇక మన తెలుగు నటులు చాలా మంది ఉండగా ఈ వేరే రాష్ట్రపు ఆర్టిస్ట్ కి సన్మానం చేయడం అనే విషయం తనకు ఎంతగానో బాధను కలిగించిందన్నారు.ఇక పృథ్వి మాట్లాడుతూ నాకు వైజాగ్తో మంచి అనుబంధం వుంది అన్నారు. అక్కడ తనకు ఎంతోమంది సన్నిహితులున్నారు. అలాగే నా రాజకీయ జీవితం మొదలైంది కూడా వైజాగ్లోనే అని అన్నారు.

ప్రకాష్ రాజ్ ను సన్మానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు అన్నాడు. ఇక ఎక్కడి నుంచో వచ్చిన అతనికి `మా` ఎన్నికల కోసం మీరెలా సపోర్ట్ చేస్తారని అన్నారు.ఇక అతనికి క్రమశిక్షణ లేదని చాంబర్ కూడా అతన్ని రెండు సార్లు సస్పెండ్ చేసింది. ఇక నేను కన్నడంలో ఓ షూటింగ్ కోసం ఆడవేశం వేస్తే అతను నా విగ్గుని పీకేసి ఇక్కడ కేవలం కన్నడ వాళ్లు మాత్రమే నటించాలి అంటూ నాపై అతను కేకలు వేశారు. దాంతో నేను సిగ్గుతో తలదించుకుని వచ్చాను. అని పృథ్వి అన్నారు.ఇక భారత దేశంలో ఎవరైన ఎక్కడ నుంచయినా సరే పోటీ చేయవచ్చు కానీ మనల్ని మాత్రం వారు అసలు పరిపాలించకూడదు. మీకు అలాంటి ఆయన ఎందుకు నచ్చాడు. ఇక పరభాషా నటుల మీద మీకు అంత ప్రేమ ఏమిటి? మన తెలుగు వాడిని గెలిపిద్దాం ఇంకా మన తెలుగు ఆత్మగౌరవాన్ని మనం కాపాడుదాం. అంటూ పృథ్వీ మాట్లాడిన ఆడియో వాయిస్ రికార్డ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో పెద్ద కలకలం అనేది సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa