గడిచిన మా ఎన్నికలలో ఎన్నికలు చాలా రసవత్తంగా జరిగాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి.. మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటా పోటీగా పోటీపడ్డారని చెప్పవచ్చు. అయితే ప్రకాష్ రాజ్ కి మాత్రం చిరంజీవి మద్దతు లభించడం జరిగింది. కానీ తెరపైకి మరొక వివాదం తీసుకువచ్చి..మంచు విష్ణు అఖండ విజయాన్ని అందుకున్నారు. అయితే తాజాగా హీరో శ్రీకాంత్ చేసిన వాక్యాలు మరొకసారి మా విభేదాన్ని తెరపైకి తీసుకువచ్చేలా ఉన్నాయని కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిన్నటి రోజున చిరంజీవి తో పాటూ శ్రీకాంత్ కూడా హైదరాబాదులో సెలబ్రిటీస్ క్రికెట్ కార్నివాల్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఆయనతోపాటు ప్రకాష్ రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది నటులు కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని డల్లాస్ లో క్రికెట్ టోర్నీ ఆడబోతున్న విషయం తెలిసిందే.  ఇక ఈ ఈవెంట్ లో హీరోలు శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు తో పాటు ప్రిన్స్ ఆదర్శ్, బాలకృష్ణ తదితరులు పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీకాంత్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మా కమిటీ పై ఇండైరెక్టుగా పంచులు వేశారని చెబుతున్నారు.

మంచి కార్యక్రమం అంటే చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ క్రికెట్ మ్యాచ్ మొదలుపెట్టి మూడు మ్యాచ్లు ఆడిన తర్వాత అమెరికా వెళ్లి ఆడడం వల్లే మొదటిసారి మా అసోసియేషన్కు ఫండ్ రైజ్ అయింది
 ఆ డబ్బులు ఇప్పుడు మా లో ఉన్నాయి అని తెలిపారు శ్రీకాంత్. ఇక ఆ తర్వాత మా ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా ఉన్న ఏ ఒక్కరూ కూడా మా కి అంత ఫిండింగ్ తీసుకురాలేకపోయారు అని శ్రీకాంత్ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మా అధ్యక్షుడిగా మంచు విష్ణును శ్రీకాంత్ టార్గెట్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: