టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా రెండు భారీ సక్సెస్ లు అందుకుని, తన తదుపరి సినిమాగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ తన కెరీర్ లో తొలిసారి గా మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ రోల్ లో నటిస్తున్న ఈ  సినిమాలో ఆయన సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ  సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

ఇక తమ సినిమా టీజర్ ని ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న సరిలేరు యూనిట్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. ఇకపోతే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో పెద్దగా బోరింగ్ సీన్స్ ఉండవని, అలానే సినిమా ఆద్యంతం కూడా మంచి సరదాగా సాగిపోయే విధంగా దర్శకుడు అనిల్ సినిమా స్క్రిప్ట్ ని తయారుచేసారట. 

 

ఇక హీరో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఫైట్స్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫుల్ కామెడీ, ప్రి క్లైమాక్స్ సీన్స్, క్లైమాక్స్ ఫైట్ వంటి వాటితో సినిమా ఓవర్ ఆల్ గా అదిరిపోనుందని, అలానే ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించే మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది. మరి ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పండుగ వార్తే అని చెప్పాలి.......!!!

మరింత సమాచారం తెలుసుకోండి: