నిన్న మొట్టిదాక మహేష్ కు అత్యంత సన్నిహతులైన దర్శకుల లిస్టులో వంశీ పైడిపల్లి చాలముందు వరసలో ఉండేవాడు. అలాంటి వంశీ పైడిపల్లి తో మహేష్ చేయవలసిన మూవీ క్యాన్సిల్ అవ్వడం వెనుక పెద్ద కథ నడిచింది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పు మంటున్నాయి. 

 

మహేష్ అమెరికా నుండి తిరిగి రావడమే తరువాయి వంశీ పైడిపల్లి మూవీ ప్రారంభోత్సవ తేది ప్రకటిస్తారు అని అందరు అనుకుంటూ ఉంటే మహేష్ ఇలాంటి ఊహించని ట్విస్ట్ ఈదర్శకుడుకి ఇవ్వడం వెనుక కొంత వంశీ పైడిపల్లి డబుల్ గేమ్ కారణం అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి అమెరికాకి వెళ్లేముందు వంశీ పైడిపల్లి వ్రాసిన కథను వినాలని ప్రయత్నించాడు అని అంటారు.

 

అయితే వంశీ ఈకథ ఇప్పటికే పూర్తిగా తయారు అయిపోయింది అనీ ఆకథ దిల్ రాజ్ కు కూడ బాగా నచ్చింది అంటూ వంశీ మహేష్ తో చెప్పడంతో మహేష్ ఆ మాటలను నమ్మినట్లు టాక్. మహేష్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత వంశీని తన వద్దకు పిలిపించుకుని మహేష్ కథ విన్నప్పుడు షాక్ అయినట్లు టాక్. ఈ కథకు సంబంధించిన టోటల్ నరేషన్ మహేష్ కు ఏమాత్రం నచ్చకపోవడంతో మహేష్ ఆకథ తనకు నచ్చలేదు అని చెప్పడమే కాకుండా అలాంటి కథ దిల్ రాజ్ కు ఎలా నచ్చింది అన్న విషయమై దిల్ రాజ్ నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తే అతడు వంశీ తనకు ఇంతవరకు కథ చెప్పలేదనీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

దీనితో వంశీ వీరిద్దరి మధ్య ఆడిన డబుల్ గేమ్ బయటపడటంతో ఈమూవీ ప్రాజెక్ట్ ను అసహనంతో మహేష్ క్యాన్సిల్ చేసాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహేష్ కు మరొక మార్గం లేకపోవడంతో ఇప్పుడు హడావిడిగా పరుశు రామ్ లైన్ లోకి వచ్చాడు అని అంటున్నారు. అయితే అతడు ఇప్పటికే 14రీల్స్ సంస్థకు కమిట్ అయి చైతన్యతో సినిమా ప్రకటించిన పరిస్థితులలో ఇప్పుడు పరుశు రామ్ మహేష్ కోసం చైతన్యను వదులుకుంటాడ అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అని కూడ ప్రచారం జరుగుతోంది. గతంలో పరుశు రామ్ ను మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళి సిటింగ్ ఏర్పాటు చేయడంలో కొరటాల హస్తం ఉంది అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కొరటాల సూచనలతో మహేష్ వంశీ పైడిపల్లిని దూరం పెట్టాడా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: