తెలుగు బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది ఆరిస్టులు జీవనోపాధిని సాగిస్తున్నారు. అయితే లాక్ డౌన్ అనంతరం ఎప్పటిలానే కొన్ని రియాలిటీ షోలు స్టార్ట్ అయ్యాయి. జబర్దస్త్ షో ఆగిపోయిందన్న వార్తలకు కౌంటర్ ఇచ్చే విధంగా మళ్ళీ మొదలుపెట్టారు. అయితే ఈ సారి కొన్ని మార్పులు చేయక తప్పలేదు. కొంతమంది కమెడియన్స్ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుధీర్, హైపర్ ఆదిల టీమ్స్ తో మంచి రేటింగ్ ని అందుకుంటున్నాయి రెండు జబర్దస్త్ షోలు.

 

 

ఇకపోతే ఇటీవల ఒక కమెడియన్ ఆంద్రప్రదేశ్ మధ్య ధరలు పెరగడంపై స్కిట్ లో భాగంగా ఒక పంచ్ వేశారు. అయితే రోజాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ కమెడియన్ మరెవరో కాదు. ముక్కు అవినాష్. స్కిట్ లో భాగంగా లాక్ డౌన్ లో ఒక ఫుల్ బాటిల్ ని తాను రూ.9000లకు కొన్నట్లు పంచ్ వేయగా రోజా స్కిట్ మధ్యలోనే కౌంటర్ ఇచ్చారు.

 

 

ఎవడు కొనమన్నాడు అంటూ స్టేజ్ పైనే కౌంటర్ ఇచ్చిన రోజా షో తరువాత కూడా అవినాష్ కి కాస్త క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పంచ్ లు వేసే ముందు కొంచెం ఆలోచించి వేయండి అంటూ అవినాష్ తో పాటు మిగతా వారికి కూడా రోజా హెచ్చరిక జారీ చేసినట్లు టాక్ వస్తోందన్నారు.

 

 

అయినా జబర్దస్త్ లో ఇలాంటి వివాదాలు రేగడం కొత్తేమి కాదు. గతంలో చాలా సార్లు నాగబాబు కూడా కమెడియన్స్ కి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కొన్ని విబేధాలు కారణంగా షోకి వీడ్కోలు పలికిన విషయం అందరికి తెలిసిందే. రోజాకు నాగబాబుకి విబేధాలు కూడా వచ్చినట్లు అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చినట్లు సమాచారం. నాగబాబు జడ్జ్ గా తప్పుకోవడంతో ప్రస్తుతం సింగర్ మనో రెగ్యులర్ జడ్జ్ గా కొనసాగుతున్నా విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: