ఇక ఆపై మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో అతి త్వరలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మంచి మెసేజ్ తో కూడిన మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైందని మార్చి తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నారని సమాచారం. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయని గతంలో పవర్ స్టార్ తో తాను పనిచేసిన సినిమాల మాదిరిగానే ఈ మూవీ సాంగ్స్ కూడా సూపర్ గా వచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఎంతో కష్టపడుతున్నాడట. ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు సాంగ్స్ కంపోజింగ్ పూర్తయిందని రేపు ఆడియో రిలీజ్ తర్వాత తప్పకుండా ఈ సాంగ్స్ పవన్ ఫ్యాన్స్ ని అలానే ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటాయని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కి ఈ మూవీ ఎంత మేరకు సక్సెస్ అందిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి.....!!