మొదట కోలీవుడ్ స్టార్ శింబు తో ప్రేమాయణం నడిపిన నయన ఆ తర్వాత ఎందుకో ఆయనతో అనుబంధాన్ని కొనసాగించలేకపోయింది.. కొన్నాళ్లకే ఆయనతో బ్రేక్ అప్ చెప్పుకుని సినిమాలు చేస్తూ వచ్చింది. అలా ప్రభుదేవా తో మరికొన్ని రోజులు డేటింగ్ చేసింది.. అతనితోనూ కొన్ని వేరే కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది నయన్.. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉండగా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.
అయితే తన పెళ్లి విషయంలో నయనతార యూటర్న్ తీసుకుందని తెలిసింది.తమ బంధం బయట పడినప్పటి నుంచి నయనతార - విఘ్నేష్ శివన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వాస్తవానికి నయనతార - విఘ్నేష్ వివాహం 2020లోనే జరగాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ కొద్ది మంది అతిథుల మధ్యలోనే నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్య ఈ వార్త బాగా వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో తన పెళ్లి విషయంలో నయనతార యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం.. నయనతార - విఘ్నేష్ పెళ్లి మార్చి నెలలోనే జరగబోతుందట. దీన్ని అంగరంగ వైభవంగా జరపాలని లేడీ సూపర్ స్టార్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీనికి కారణం.. నిరాడంబరంగా జరిపేందుకు విఘ్నేష్ ఫ్యామిలీ నిరాకరించడమేనని టాక్. తమ కుమారుడి వివాహం గ్రాండ్గా చేయాలని వాళ్లు బలవంతం పెట్టడం వల్లే నయన్ ఈ విషయంలో యూటర్న్ తీసుకుందని సమాచారం.