ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ అలానే కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నారు. అయితే వీటిలో యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసిన ప్రభాస్, మరోవైపు సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నట్టు సమాచారం.

ఇక రాధేశ్యామ్ సినిమా జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక రెట్రో లవ్ స్టోరీ గా మంచి కమర్షియల్ హంగులతో రూపొందుతున్నట్లు టాక్. ఇటీవల రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక యదార్థ ప్రేమ కథ కు కొద్దిపాటి కల్పిత కథను అల్లి దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఒక సర్ప్రైజింగ్ రోల్ చేస్తున్నారని ఇటీవల ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని కాగా అతి త్వరలో ఆయన ఎవరు అనేది యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని చెబుతున్నారు. కాగా ఆ పాత్రలో జాన్ అబ్రహం, అజయ్ దేవగన్ లలో ఎవరో ఒకరు నటిస్తున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: