ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న హీరోయిన్ రష్మిక.. చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం తో సూపర్ హిట్ కొట్టి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది.. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెనూ గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు దర్శక నిర్మాతలు.. భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవడంతో ఆమెకు టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తోంది.. అదే కాకుండా ఇంకో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..

 టాలీవుడ్లోనే కాకుండా తమిళంలోనూ ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. కార్తీ నటించిన సుల్తాన్ సినిమా లో నటించిన తమిళ్లో తనదైన ముద్ర వేసింది.. తొలి సినిమాతోనే అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక కు అక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు రావడం ఖాయమని చెబుతున్నారు.. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది రష్మిక మందన.. సిద్ధార్థ్ మల్హోత్రా  సరసమా మిషన్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక. ఈ సినిమా కూడా హిట్ అయితే బాలీవుడ్లోనూ తనూ బిజీ అవడం ఖాయమని చెబుతున్నారు.. ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులకు కూడా ఒప్పుకుందట..

ఈ నేపథ్యంలోనే ఆమె ఓ బాలీవుడ్ సినిమా ని రిజెక్టు చేసిందని చెప్తున్నారు.. టాలీవుడ్ లో తెరకెక్కిన జెర్సీ సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.  ఈ సినిమాలో హీరో భార్య పాత్రలో ఆమెను నటింప చేయాలని దర్శకుడు సంప్రదించగా, ఆ ఆఫర్ ను రష్మికా రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.. అయితే ఈ రిజెక్షన్ కు కారణం లేకపోలేదట.. జెర్సీ సినిమాలో హీరోయిన్ గా చేసినా శ్రద్ధ శ్రీనివాస్ ఓ బిడ్డకు తల్లిగా చేసింది.. ఇదే పాత్రను బాలీవుడ్ లో కూడా రాసుకున్నా దర్శకుడు ఆమెను కూడా అలాంటి పాత్రలో నటించే చేయాలనిఆమెకు కథ  చెప్పగా, ప్రస్తుతం డైరెక్ట్ హీరోయిన్ల పాత్రలే బాగా వస్తున్నాయి.. ఇలాంటి టైంలో తల్లి పాత్రలు చేయడం నాకు తెలియదు కి అంత మంచిది కాదని ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట రష్మిక.. చేసింది కొన్ని సినిమాలే అయినా రష్మిక కు  ఈ రేంజ్ లో క్లారిటీ ఉండడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.. మరి సౌత్ లో ఇప్పటికే ఇరగదీస్తున్న రష్మిక బాలీవుడ్ లో ఎలాంటి హీరోయిన్ గా ఎదుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: