మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న తాజా మూవీ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా తండ్రి మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే చరణ్ కి జోడీగా నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి ఆచార్య అనే మాజీ నక్సలైట్ గా కనిపించనుండగా రామ్ చరణ్, సిద్ద అనే పాత్ర చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, తో పాటు లాహే లాహే లిరికల్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై శ్రోతల నుండి విశేషమైన స్పందన అందుకున్నాయి. తొలిసారిగా మెగాస్టార్ తో కలిసి మెగాపవర్ స్టార్ కూడా జత కట్టడం అలానే వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాలమూవీ తీస్తుండడంతో ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సినిమా వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు, రామ్ చరణ్ ఎపిసోడ్, చిరంజీవి భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్, ముఖ్యంగా చిరు, చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని, వీటికి ఆడియన్స్ గనుక బాగా కనెక్ట్ అయితే ఆచార్య సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. కాగా ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేయాలని భావించారు, అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో కొనసాగుతుండడంతో ఆచార్య విడుదల ని కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: