మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఆణిముత్యం. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి చాలాకాలం వరకు టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా వెలుగొందారు. రాజకీయాల్లోకి ప్రవేశించక కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ తెలుగు సినిమా రీ ఎంట్రీ ఇచ్చాక మెగా బాస్ స్పీడ్ మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి సినిమా విజయం అందుకున్న తర్వాత చిరు బాక్స్ ఆఫీస్ వద్ద తన మెగా సీనియారిటీ ని చూపించడానికి ఆచార్య సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో మెగా హీరో సరసన కాజల్ అగర్వాల్ నటించగా సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని చిరు తనయుడు చెర్రీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిరు మలయాళం మూవీ రీమేక్ లూసిఫర్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా, ఈ సినిమా అనంతరం మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలసి సినిమా పట్టాలెక్కించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇక మరో వైపు చిరు అప్ కమింగ్ మూవీ ఇదే నంటూ వార్త వైరల్ గా మారింది. చిరు నుండి వచ్చిన మాస్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కించనున్నాడని చిత్రపురి టాక్.  ప్రస్తుతానికి చిరు బిజీగా ఉన్నప్పటికీ, కథను వినిపించేశారట. కథ నచ్చడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని భోగట్టా. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఇందులో చిరుకి జోడీగా సీనియర్ హీరోయిన్ లను సంప్రదిస్తున్నారట ? ఈ కొత్త చిత్రంలో చిరు పక్కన బాలీవుడ్ నుండి ప్రముఖ నటుడు నైటిన్చానున్నారని సమాచారం. ఇలా ఇది పాన్ ఇండియా మూవీగా మారబోతోంది.

మొదట ఆ బాలీవుడ్ నటుడు ఈ టాలీవుడ్ సినిమా చేయడానికి నిరాకరించారట, అయితే మెగాస్టార్ చిత్రం అని చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా జరిగితే చిరు కెరీర్ లో మరో అస్సెట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: