ఇటీవలే సిటిమార్ సినిమాతో దర్శకుడు
సంపత్ నంది హీరో గోపీచంద్ ఇద్దరు ఒకేసారి భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. దీనికి ముందు వీరిద్దరి కెరీర్ బాగోలేదనే చెప్పాలి. మంచి సినిమాలను చేస్తూ కూడా వరుస అపజయాలను పొందుతూ ప్రేక్షకులను ఏ విధంగా లేకపోతున్నారు ఈ ఇద్దరు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి గతంలో
గౌతమ్ నంద
సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగా అది ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ సారి తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా
సినిమా చేయాలని చెప్పి ఓ అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాగా సిటీ మార్
సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
వరుణ్
సందేశ్ హీరోగా నటించిన ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించిన
సంపత్ నంది రెండో
సినిమా రామ్ చరణ్ తో కలిసి
రచ్చ సినిమా చేసి ఇంట్రెస్టింగ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ చిన్న దర్శకుడు అది కూడా రెండో సినిమానే పెద్ద హీరోతో చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఆ విధంగా
సంపత్ రామ్ చరణ్ తో
రచ్చ సినిమా చేసి హిట్ సంపాదించి ఆ తర్వాత
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
గబ్బర్ సింగ్ సీక్వెల్
సినిమా సంపత్ నంది చేయాలని పవన్
కళ్యాణ్ ఆఫర్ ఇవ్వగా స్క్రిప్టుతో పవన్ ను మెప్పించలేకపోయాడు దాంతో ఆ చిత్రం చేజారిపోయింది .
ఆ వెంటనే రవితేజతో కలిసి
బెంగాల్ టైగర్ సినిమా చేయగా దాంతో పర్వాలేదు అనిపించుకున్నాడు
సంపత్ నంది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ తో
గౌతమ్ నందా అనే
సినిమా చేసి భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. దాంతో చాలా గ్యాప్ తీసుకొని మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాగా సిటిమార్
సినిమా రూపంలో భారీ విజయం ఆయనను వరించి ఆయన కెరీర్ లోనే సూపర్ హిట్
సినిమా గా నిలిచింది. ఈ సినిమాతో ప్రేక్షకులలో
సంపత్ నంది మంచి నమ్మకం ఏర్పరుచుకున్నాడు అని చెప్పవచ్చు నిర్మాతగా కూడా పలు ఆసక్తికరమైన సినిమాలను చేసిన
సంపత్ నంది ఇప్పుడు దర్శకుడిగా కూడా ప్రేక్షకుల నమ్మకాన్ని పొంది మంచి అభిమానాన్ని ఏర్పరుచుకున్నాడు.