టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే మంచి నటుడిగా గొప్ప ఇమేజ్ ను భారీ పాపులారిటీని ఉన్న హీరో మహేష్ బాబు. కృష్ణ వారసుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఈ హీరో తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్నో రికార్డులు సృష్టించే సినిమాలను చేశాడు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా పోకిరి చిత్రం నిలుస్తుందని తప్పకుండా చెప్పవచ్చు. అలా ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంటూ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగాడు.

ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వేసవి లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మహేష్ కెరీర్లోనే విభిన్నమైన కథాంశంతో గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న మహేష్ బాబు తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు.  ఆ విధంగా ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు మరియు ఖలేజా సినిమాలు చేయగా అవి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మీరు భావిస్తున్నారు.

సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అయితే పక్కాగా ఉంటుందనేది మాత్రం నిజం. ఈ నేపథ్యంలో మహేష్ తో సినిమా చేయడానికి మరింత మంది దర్శకులు పోటీ పడుతుండటం విశేషం. కొరటాల శివ మహేష్ తో మూడో సినిమా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేసిన తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమా చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కూడా ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: