ఇంతకాలానికి మళ్ళీ సినిమా ల్లోకి అడుగు పెట్టింది. మొగలిరేకులు సీరియల్లో నటించిన సాగర్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రుడి తో జోడి కట్టబోతుంది రాశి. రాజేంద్రుడి తో ఇది మూడో సినిమా ఆమెకు. తెలుగు చిత్ర సీమలో రోజుకో కొత్త అమ్మాయి కధానాయికగా వస్తోంది.
తమన్నా, కాజల్, సమంత వీళ్ళ జోరు ఎలాగు కొనసాగుతూనే వుంది. వీళ్ళ మధ్య రాశి మళ్ళీ నిలదొక్కు కోవడం అంటే మాటలు కాదు. మరి ఈ సవాల్ ఎలా స్వీకరిస్తుందో చూడాలి.