అలాగే మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆపాదించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగైతే వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. సగటు భారతీయుడిగా.. అందరికీ సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. అలాగే ఇక తాను రైతు సమస్యలపై స్పందించినంత బలంగా రామతీర్థం సంఘటన విషయంలో రియాక్ట్ కాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశమని.. రామతీర్థ యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక దోషులను పట్టుకోవాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం ఆనాడే సరిగ్గా పట్టించుకుని ఉంటే ఈ గొడవే ఉండేది కాదని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
అలాగే మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆపాదించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగైతే వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. సగటు భారతీయుడిగా.. అందరికీ సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. అలాగే ఇక తాను రైతు సమస్యలపై స్పందించినంత బలంగా రామతీర్థం సంఘటన విషయంలో రియాక్ట్ కాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశమని.. రామతీర్థ యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక దోషులను పట్టుకోవాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం ఆనాడే సరిగ్గా పట్టించుకుని ఉంటే ఈ గొడవే ఉండేది కాదని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.