వచ్చే ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు హుజురాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కసి తో ఉన్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అంతా హుజురాబాద్ లో మకాం వేసి అక్కడ ఈటల ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కెసిఆర్ హుజురాబాద్ లో గెలవడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. దీంతో ఇక్కడ మూడుముక్కలాట తప్పేలా లేదు.
హుజూరాబాద్ నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాలుగా తన కంచుకోటగా మార్చుకున్న ఈటల ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆయన క్రేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే రాజకీయాలలో ఆయన వెనక పడిపోవడంతో పాటు బిజెపిలో ఒక సాధారణ నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈటల గెలిస్తే బీసీ కోటాలో ఆయనకు రాష్ట్ర బిజెపి పగ్గాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ఎంపీగా ఉన్నందున పార్టీ పగ్గాలు ఈటలకు ఇస్తే ఆయన టిఆర్ఎస్ లో పలువురు అసంతృప్తులను బిజెపి లోకి తీసుకు వస్తారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈటల భవిష్యత్తు ఎలా ఉంటుందో ? హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం డిసైడ్ చేయనుంది.