వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలను టార్గెట్ చేస్తే, ఆయన కొడుకు పెట్టిన పార్టీ నుంచి టికెట్ పొంది ఎంపీ గా గెలిచిన ఆర్ ఆర్ ఆర్..ఇద్దరు వ్యక్తులను అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ రెండు పత్రికలూ ఆర్ ఆర్ ఆర్ కు బాహాటంగానే మద్దతు ఇస్తున్నాయి. అంటే ఈనాడు కు జగన్ శత్రువు. ఆర్ ఆర్ ఆర్ మంచి దోస్తు. అలానే రాధాకృష్ణ కు కూడా.. సో..ఇప్పటికిప్పుడు నాకెందుకులే అని మనసు మార్చుకుని ఆర్ ఆర్ ఆర్ కొన్ని ఆర్థిక ఒడంబడికల్లో భాగంగా వైసీపీతో రాజీ కుదుర్చుకుంటే లాభం జగన్ కు .. నష్టం రామోజీ రావుకు రాధా కృష్ణకు.. ఇప్పటికీ కొందరు రాజులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. అది నిజం కూడా! అన్నీ కలగలిస్తేనే రా జకీయం.. బయట వినిపించేవేవీ నిజాలు కావు. కనుక ఆ ఇద్దరూ కలిసి పోతే.. అనగా జగన్ మరియూ రఘు రామ అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందంటారు? ఏం కాదు రామోజీ జనంలో చులకన అయిపోవడం ఖాయం. ఆయనతో పాటే రాధాకృష్ణ కూడా! అయితే జగన్ ఈనాడుపై కక్ష సాధింపునకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా, రాధా కృష్ణను నేరుగా టార్గెట్ చేయకపోయినా.. తెరవెనుక ఈ ఇద్దరితోనూ వైసీపీ పెద్దలకు మంచి అనుబంధాలే ఉన్నాయని, అందుకే ఈ పోరు రాజకీయాలకే పరిమితం చేద్దా మన్న భావనలో జగన్ ఉన్నారని టాక్ . కనుక మీరంతా మరీ ఆయాసం తెచ్చుకుని పరిణామాలను నమ్మకండి.. ఎల్లో బ్రదర్స్..
అక్రమాస్తుల కేసులు ఇప్పట్లో తేలవు.అవి ఇంకాస్త కాలం కొనసాగుతాయి.బీజేపీ గద్దె దిగిపోయాక కూడా ఉంటాయి. ఈ కేసులు ఎక్కువ రోజులుంటే కేంద్రంలో ఉన్న పార్టీలకే బలం. ఆ సంగతి సోనియాకు తెలుసు. ఆ సంగతి బీజేపీ బ్యాచ్ కు కూడా తెలుసు. కనుక వాళ్లు ఆ కేసుల నుంచి జగన్ ను తప్పించాలని అనుకోరు. పోనీ కేసులు ఇవి వీ టికి శిక్షలు ఇవి అని తేల్చేలా దర్యాప్తు సంస్థల స్పీడు ను పెంచనివ్వరు. అందుకే రఘు రామ మాట్లాడతారు. ఆయన మాట్లాడినా మాట్లాడకున్నా ఈ కేసులు కొనసాగినం త కాలం జగన్ కు కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు. అందుకే రఘురామతో వైసీపీ సంప్రతింపులు జరపవచ్చు. అందులో ఆశ్చర్యం లేదు. నేరుగా సీన్ లోకి సాయి రెడ్డి వెళ్లకపోయినా బీజేపీ లీడర్లతో చెప్పించి అయినా ఆయన వెనక్కు తగ్గేలా చేయొచ్చు. ఇదంతా నాల్రోజుల నాటకం. దీనిని నమ్మినా నమ్మకున్నా లబ్ధి పొందే ది జగనే అన్నది కాదనలేని వాస్తవం. ఏదేమయినా జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం జరగని పని.. ఆ ఊహలు అలానే ఉండనివ్వండి కానీ జరిగేది జరగబోయేది కేవలం రాజీ రా జకీయాలే..