ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ వరదల పైనే పడింది. అన్నమయ్య ప్రాజెక్టు మట్టిగడ్డ తెగిపోవడంతో ఈ రాజకీయ నాయకులు అరంగేట్రం ప్రారంభమైంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శిస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రమే కాకుండా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ కూడా ఏపీ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని అనడంతో ఏపీ రాజకీయాల్లో మంటలు చెలరేగాయి. దీనిపై వైసీపీ మంత్రి అనిల్ కూడా స్పందించి విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. బిజెపి పార్టీ కావాలనే తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోందని మండిపడ్డారు. పెన్నా బేసిన్కు చరిత్రలో ఎప్పుడూ రానంత వరద వస్తే ఎవరైనా ఏం చేస్తారు అని, ప్రకృతి ప్రలయాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ఎన్ని గేట్లు ఎత్తి వేసిన మట్టికట్ట కొంతమేరకు దెబ్బతిందని, దీనిపై కూడా రాజకీయం చేస్తార అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ వరదల పైనే పడింది. అన్నమయ్య ప్రాజెక్టు మట్టిగడ్డ తెగిపోవడంతో ఈ రాజకీయ నాయకులు అరంగేట్రం ప్రారంభమైంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శిస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రమే కాకుండా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ కూడా ఏపీ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని అనడంతో ఏపీ రాజకీయాల్లో మంటలు చెలరేగాయి. దీనిపై వైసీపీ మంత్రి అనిల్ కూడా స్పందించి విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. బిజెపి పార్టీ కావాలనే తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోందని మండిపడ్డారు. పెన్నా బేసిన్కు చరిత్రలో ఎప్పుడూ రానంత వరద వస్తే ఎవరైనా ఏం చేస్తారు అని, ప్రకృతి ప్రలయాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ఎన్ని గేట్లు ఎత్తి వేసిన మట్టికట్ట కొంతమేరకు దెబ్బతిందని, దీనిపై కూడా రాజకీయం చేస్తార అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.