భారతదేశంలో ఉన్న ప్రముఖ నదులలో గంగానది ఒకటి. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన పురాణ గాథల ఆధారంగా గంగావతరణం ఎలా జరిగిందన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షం పదో రోజున గంగాదేవి దివినుండి ఈ భువి పైకి చేరిందని మన పురాణాల్లో చెప్పబడింది . అందుకే ప్రతి ఏడు ఈ పవిత్రమైన రోజున మన భారతదేశంలో గంగా దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. కాగా ఈసారి 2021 సంవత్సరంలో జూన్ 19వ తేదీన గంగా దసరా పండుగ వచ్చింది. జూన్ 19వ తేదీన సాయంత్రం 6:50 గంటలకు గంగా దసరా సంబరాలు ప్రారంభమయ్యి జూన్ 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగియనున్నాయి. 

అయితే ఈ పవిత్రమైన రోజున లక్షలాదిమంది భక్తజనం ప్రపంచ దేశాల నలుమూలల నుండి గంగా నదికి చేరుకొని గంగా నది స్నానం చేయడం ఎప్పటి నుండో వస్తోంది. ఈ పవిత్రమైన రోజున గంగాజల స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. అందుకే ఆ రోజున భక్తజనం గంగానదికి స్నానానికై  తరలివస్తారు.
అయితే పోయిన ఏడాది లాగే ఈసారి కూడా కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో గంగా నది స్నానం కష్టతరమైనందున పండుగకు ముందుగానే గంగానది నీటిని బాటిల్ లో తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవాలి. పండుగ రోజున స్నానం చేసే నీటిలో గంగా జలం నీటి చుక్కలను కొద్దిగా కలిపి స్నానం ఆచరించినా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.


అనంతరం ‘ఓం శ్రీ గంగే నమ'  అన్న మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ గంగమ్మ తల్లిని ప్రార్థించండి. తర్వాత కొత్త దుస్తులు ధరించి పేదవారికి దానధర్మాలు చేయడం వలన పుణ్య ఫలం మరింత పెరుగుతుంది అంటున్నారు పెద్దలు.  కరోనా ముప్పు పొంచి ఉన్నందున రద్దీ ఉన్న ప్రదేశాలకు ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి ఈ పద్ధతిని ఆచరించినా కొంతలో కొంత పుణ్యఫలం దక్కుతుందని అంటున్నారు పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: