తెలంగాణకు కొత్తగా 11 మంది ఐపీఎస్ అధికారులు వస్తున్నారు. వీరిని కేంద్ర హోంశాఖ తెలంగాణకు ఇటీవల కేటాయించింది. వీరు సెప్టెంబర్ నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. అక్టోబర్ చివరివారం లేదా నవంబర్ తొలివారంలో వీరంతా బాధ్యతలు స్వీకరిస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిజానికి.. మొత్తంగా 40 మంది ఐపీఎస్ అధికారులు కావాలని కేంద్రాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది.
అయితే.. జూన్లోనే నలుగురు సీనియర్ ఐపీఎస్లు రిటైర్ కానుండటంతో హోంశాఖ ఇప్పటికే బదిలీలు, పదో న్నతులపై కసరత్తు పూర్తి చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఐజీల పదోన్నతుల విషయంలోనూ ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.