ఆంధ్రప్రదేశ్ లో ఇసుక,మద్యం విషయంలో ఇప్పుడు అధికార పార్టీని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. మద్యం అక్రమ రవాణా విషయంలో పదే పదే వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ జనసేన, బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్రమ రవాణా జరుగుతున్నా సరే చూస్తూ ఉన్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరొకరు ఇదే విధంగా విమర్శలు చేసారు. 

 

ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలు రాష్టాన్ని అతలాకుతలం చేస్తున్నాయని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపణలు చేసారు. అవినీతిని పెంచి పోషిస్తూ అరాచకాలను సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్షేమం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శలు చేసారు. రాష్ట్రంలో టీడీపీ రోజు రోజుకూ క్షీణీస్తోందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ రోజు రోజుకూ ప్రజాదరణ కోల్పోతోందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: